ఆత్మసాక్షాత్కారం పొందిన గురువునే సిద్ధగురువు అంటారు. కోట్లల్లో ఎవరో ఒకరు మాత్రమే పొందే దుర్లభమైన ఆత్మసాక్షాత్కారాన్ని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షివారు 1995 జూన్ 29న పొందారు. వారు ఆత్మ సాక్షాత్కారము పొందడమే కాకుండా 2001వ సంవత్సరంలో ఇతరులకు తన తపోశక్తితో క్షణాలలో దివ్య అనుభవాలు ప్రసాదించే శక్తి పాత సిద్ధిని( గురువుయొక్క కాస్మిక్ శక్తి శిష్యుడు లోకి ప్రవేశించడం ) పొందిన యోగీశ్వరులు. ఆనాటి నుండి శ్రీ రమణానంద మహర్షి వారు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి శక్తిపాతం చేశారు . మహర్షి వారి నుండి శక్తిపాతాన్ని పొందిన ఎంతోమంది భక్తులు క్షణాలలో రోగనాశనమును పొందారు , ఎంతోమంది సూక్ష్మశరీరయానము చేశారు, ఎంతోమంది ధ్యానములో మనస్సు నిశ్చలమై కొన్ని గంటలు కూర్చొనగలిగారు .ఈ విధంగా శ్రీ రమణానంద మహర్షి వారు తన తపోశక్తిని లోకానికి ధారపోసి కొన్ని లక్షల మందిని ఆధ్యాత్మిక సాధకులుగా తీర్చిదిద్దుతున్నారు .
వివరాలు