విషయ సూచిక
వేద ఋషి లింగాలు
సనాతన ఋషులు వేదమును అందించి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. ఋషులు వారి తపోశక్తితో ధ్యానములో దర్శించిన, వినిన మంత్రాలను శ్లోక రూపంలో వేదములో పొందుపరిచారు. వారిని మంత్రద్రష్టలు అని అంటారు.
వేద ఋషుల యొక్క ఉనికి ప్రమాణము వేదం. తపోనిష్ఠులైన ఎందరో వేద ఋషులు అందించిన తత్వ జ్ఞానభాండాగారమే వేదము.
ఋషులు సమాధిలో అంతర్ముఖులై అంతర్వాణిని విని, లోక కళ్యాణం కోసం వాటిని అందించారు. ఋషులు భగవంతుని యొక్క తత్వజ్ఞానాన్ని లోకానికి ప్రసాదించారు. ఈ కాలంలో ఇటువంటి వారిని మహర్షులని, జ్ఞానోదయం పొందిన గురువులని, సిద్ధగురువులని, యతులని సంభోదిస్తారు వేద ఋషుల యొక్క సంపూర్ణ జ్ఞానం ఇటువంటి సిద్ధగురువుల ద్వారా లోకానికి బహిర్గతమవుతుంది
వేద లింగ ప్రతిష్ఠాయజ్ఞం
సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఋషి వేదాలను, వేద ఋషుల యొక్క హృదయాన్ని లోకానికి అందించాలనే సత్సంకల్పంతో వేదాలపై విస్తృత పరిశోధనలు చేశారు. వేదమాత సేవలో భాగంగా ఎన్నో అవైదిక ప్రచారాలను ఖండించి అసలైన సత్య జ్ఞానాన్ని లోకానికి అందించే దిశగా ప్రచారం చేస్తున్నారు.
ఆ పరమేశ్వరుడి సంకల్పంతో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 728 వేద ఋషులు, 84 మన్వంతర సప్త ఋషులు, 1204 ఉపనిషత్ మరియు పురాణ ఋషులు మొత్తం 2016 ఋషులు వేదమును లోకానికి అందించే అసాధారణ సేవ చేసినట్లు గుర్తించారు. వారి అసాధారణ సేవలకు గుర్తుగా ఒక్కొక్క ఋషి నామము పై ఒక్కొక్క శివలింగమును మొత్తం 2016 వేద ఋషి శివలింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఈ ప్రతిష్ఠల వలన ఆ ఋషుల యొక్క ఆశీస్సులు లోకానికి అందించబడతాయి.
ఋషిలింగ సన్నిధానాలు
- 16 ఋషిలింగాలు కొలువైన అహల్య, గౌతమ మహర్షి దర్బార్
- 12 ఋషిలింగాలు కొలువైన అరుంధతి, వశిష్ట మహర్షి దర్బార్
- 6 ఋషిలింగాలు, శిరిడి సాయినాథుడు కొలువైన లోపాముద్ర, అగస్త్య మహర్షి దర్బార్
- 19 ఋషిలింగాలు కొలువైన మార్కండేయ మహర్షి దర్బార్
- 27 ఋషిలింగాలు, 4 విగ్రహ మూర్తులు కొలువైన భరద్వాజ మహర్షి దర్బార్
- 29 ఋషిలింగాలు, 4 విగ్రహ మూర్తులు కొలువైన విశ్వామిత్ర మహర్షి దర్బార్
- 27 ఋషిలింగాలు, 4 విగ్రహ మూర్తులు కొలువైన జమదగ్ని మహర్షి దర్బార్
- 27 ఋషిలింగాలు, 4 విగ్రహ మూర్తులు కొలువైన భృగు మహర్షి దర్బార్
- 35 ఋషిలింగాలు, 4 విగ్రహ మూర్తులు కొలువైన కణ్వ మహర్షి దర్బార్
- 27 ఋషిలింగాలు, 4 విగ్రహ మూర్తులు కొలువైన స్వాయంభువ మను దర్బార్
- 27 ఋషిలింగాలు, 4 విగ్రహ మూర్తులు కొలువైన సతీ దేవి సన్నిధానం
- 16 ఋషిలింగాలు, 3 విగ్రహ మూర్తులు కొలువైన అగ్ని మహర్షి దర్బార్
- 11 ఋషిలింగాలు, 2 విగ్రహ మూర్తులు కొలువైన యమ మహర్షి దర్బార్
- 11 ఋషిలింగాలు, 2 విగ్రహ మూర్తులు కొలువైన కర్దమ మహర్షి దర్బార్
- 16 ఋషిలింగాలు, 3 విగ్రహ మూర్తులు కొలువైన అంగీరస మహర్షి దర్బార్
ఋషిలింగాల ప్రతిష్ఠలో పాల్గొనాలనుకుంటే...
సంబంధిత విరాళాలు
ఆలయ నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కూడా అంగీకరించబడును మమ్మల్ని సంప్రదించండి
ద్రవ్య రూపంలో విరాళాలు
శిరిడి సాయిబాబా మీరు నాకు ప్రేమతో ఒక రూపాయిని ఇస్తే, దానికి బదులుగా మీకు 10 రూపాయలు ఇవ్వడానికి నేను కట్టుబడి ఉన్నాను అని అన్నారు. ఆలయ నిర్మాణానికి ద్రవ్య రూపంలో విరాళాలు అంగీకరించబడును డొనేట్