శిరిడి సాయి శతాబ్ది ఆరాధనా గురు మహాసేవ

శిరిడిసాయి బాబా వారు మహాసమాధి చెంది 102 సంవత్సరాలు అయినా భక్తుల హృదయాలలో శాశ్వతముగా కొలువై సమాధినుండే భక్తుల కోరికలను తీరుస్తున్నారు .కష్ట నష్టములు తొలగిస్తున్నారు . సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు శిరిడి సాయి శతాబ్ది ఆరాధన గురు మహా సేవ -శిరిడి సాయి శతాబ్ది ఆరాధన మహోత్సవం 2017 సెప్టెంబర్ 30 నుండి 2018 అక్టోబర్ 19 వరకు రమణేశ్వరములో అత్యంత వైభవముగా నిర్వహించారు ఈ కార్యక్రమము 3 అడుగుల బంగారు శివలింగమును శిరిడి సాయి పేరుపై ప్రతిష్ఠించారు .

నీవు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను అంటారు శిరిడి బాబా వారు . సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు బాబా మీద దివ్య ప్రేమతో ,అపార అనురాగముతో శిరిడి సాయి శతాబ్ది ఆరాధన గురు మహా సేవ -శిరిడి సాయి శతాబ్ది ఆరాధన మహోత్సవం 2017 సెప్టెంబర్ 30 నుండి 2018 అక్టోబర్ 19 వరకు రమణేశ్వరములో అత్యంత వైభవముగా నిర్వహించారు. శ్రీ మహర్షి వారి దివ్యసేవ కు స్పందించిన శిరిడిబాబా తన అనుగ్రహాన్ని తన ప్రత్యక్ష దర్శనము ద్వారా మహర్షి వారికి ప్రసాదించారు . ఇది శిరిడిసాయి బాబా తనను ప్రేమించిన శిష్యులకు ప్రసాదించే అపార అనుగ్రహమునకు నిదర్శనము . ఈ శతాబ్ది ఆరాధన త్రయంబక సాయి విగ్రహాన్ని మరియు 100 శివ లింగాలు బాబా వారి పేరుపై ప్రతిష్టించడముతో 2018 అక్టోబర్ 19 న ముగిసినవి .

గ్యాలెరీ